Extra Jabardasth: ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌లో యాంక‌ర్ ర‌ష్మీ పెళ్లి.. వ‌రుడు ఎవ‌రంటే?

Updated on May 28, 2022 10:45 PM IST
యాంక‌ర్ ర‌ష్మీ (Anchor Rashmi)
యాంక‌ర్ ర‌ష్మీ (Anchor Rashmi)

బుల్లితెర‌పై 'ఈటీవీ' వేదికగా ప్రేక్షకులకు నవ్వులు పంచే కామెడీ షో 'ఎక్స్‌ట్రా జబర్దస్త్‌' (Extra Jabardasth). ప్రతి శుక్రవారం ప్రసారం అయ్యే ఈ షో ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటోంది. సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, ఇమ్మాన్యూల్, వర్ష, రాకింగ్ రాజేష్ లాంటి కమెడియన్లు తమ స్కిట్స్‌‌తో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నారు. ఒకరిని మించేలా మరొకరు స్కిట్స్‌తో దూసుకుపోతున్నారు  ఎప్పటిలానే ఈ వారం కూడా ఈ షో ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమైంది. జూన్ 3 న ప్రసారం కాబోయే ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై ప్ర‌స్తుతం హల్​చల్​ చేస్తోంది. 

కాగా, ఈ ఎపిసోడ్‌కి హీరోయిన్ సదా జడ్జిగా హాజరయ్యారు. ఇక‌, ప్రోమోలో (Promo) భాగంగా చూపించిన ఫన్నీ ఎలిమెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇమ్మాన్యుయేల్, బుల్లెట్ భాస్కర్ టీమ్ ఈసారి బాహుబలి పేరడీతో వచ్చేశారు. ఇమ్మాన్యుయేల్ కట్టప్ప వేషం ధరించి నవ్వులు పూయిస్తున్నాడు. బాహుబలి సినిమాలో కట్టప్పకు పెళ్లి కాలేదు. ఒక వేళ కట్టప్పకు పెళ్లి అయి ఉంటే.. బాహుబలి ఎలా ఉండేదంటూ బుల్లెట్​ భాస్కర్​ చేసిన స్కిట్​ నవ్వులు పూయిస్తోంది.

మ‌రోవైపు రోహిణి ఈ స్కిట్‌లో రాజమాత శివగామి గెటప్‌లో కనిపించింది. దీంతో ప్రోమోలో రోహిణి పాత్ర హైలెట్​గా నిలిచిందనే చెప్పవచ్చు. కాగా, అన్ని పాత్రలు ఫన్నీగా బిహేవ్ చేస్తుండడంతో కామెడీ బాగా పండింది. ఇక‌, స్కిట్‌లో భాగంగా ఇమ్మాన్యుయేల్ జ‌డ్జిగా వచ్చిన సదా, యాంక‌ర్ రష్మీపై వేస్తున్న జోకులు ఆకట్టుకుంటున్నాయి. కట్టప్ప భార్యతో రాజమాత దెబ్బలు తినడం సరదాగా ఉంది. బాహుబలి సినిమాని ఖూనీ చేస్తున్నప్పటికీ, ఆర్టిస్టులు బాగానే ఫన్ జనరేట్ చేశారు

 

మ‌రో స్కిట్ లో ఆటో రాంప్రసాద్, సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) టీమ్‌లో యాంక‌ర్ రష్మీ కూడా పాల్గొంది. ఈ స్కిట్‌లో రష్మీ ఆటో రాంప్రసాద్ చెల్లిగా నటించింది. ఇక‌, స్కిట్‌లో భాగంగా టీమ్ లీడ‌ర్ ఆటో రాంప్రసాద్ తన చెల్లికి పెళ్లి చేయాలని డిసైడ్ అవుతాడు. దీంతో పెళ్లి కూతురిగా రష్మీ సాంప్రదాయ వస్త్రధారణలో అందంతో వెలిగిపోవడం విశేషం. మా చెల్లి ఎలా ఉంది? అని రాంప్రసాద్ టీమ్ స‌భ్యుడు సన్నీని అడుగుతాడు. అతుడు ఆమె "చాలా చాలా అందంగా ఉందని" చెబుతాడు.

దీనికి రాంప్రసాద్ "మేకప్ లేకపోతే యావరేజ్" అని చెప్పడం చాలా ఫన్నీగా ఉంటుంది. పెళ్లి పీటలమీద కూర్చునే టైంకి రష్మీ.. "అన్నయ్య.. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను మరొకరిని ప్రేమించాన‌ని" చెబుతుంది. "నేను నిద్రమాత్రలు మింగేస్తా" అని బెదిరిస్తుంది. "కాసేపట్లో పెళ్లి పెట్టుకుని.. ఇప్పుడు పడుకుంటావా" అని రాంప్రసాద్ అడగడంతో స్కిట్‌లో నవ్వులు పూస్తాయి. 

అప్పుడు ర‌ష్మీ (Anchor Rashmi) "మనం ఒకరికి మనసిస్తే.. ఈ గుండెలో జీవితాంతం స్థానం వాళ్ళకి మాత్రమే" అని ఎమోషనల్‌గా డైలాగ్స్ చెబుతుంది. అయితే, ఎలాగోలా చివరకు పెళ్ళికి రెడీ అయిపోతుంది.ఇక వరుడిగా వచ్చిన అబ్బాయి ముఖానికి మల్లెపూల తొడుగు ఉంటుంది. దీంతో ముఖం కనిపించదు. ఓవైపు పెళ్లి ఇష్టం లేదని అంటూనే, రష్మీ పెళ్లి పీటలపై కూర్చుంటుంది. అయితే ఆ అబ్బాయి సుధీరేనా కాదా అనేది ట్విస్ట్‌గా మారింది. అయితే, ఆ ట్విస్ట్ ఏంటో తెలియాలంటే జూన్ 3న ప్రసారం కాబోయే ఈ ఫుల్ ఎపిసోడ్‌ను చూడాల్సిందే.

Advertisement
Credits: Youtube (Extra Jabardasth)

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!