Extra Jabardasth Promo: సుడిగాలి సుధీర్ కోసం యాంకర్ రష్మి దీక్ష.. కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రోమో!

Updated on Jun 05, 2022 02:40 PM IST
గెటప్ శ్రీను, రష్మి, సుధీర్, రాంప్రసాద్ (Anchor Rashmi, Ramprasad, Sudheer, Srinu)
గెటప్ శ్రీను, రష్మి, సుధీర్, రాంప్రసాద్ (Anchor Rashmi, Ramprasad, Sudheer, Srinu)

బుల్లితెరపై జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  మల్లెమాల ప్రొడక్షన్స్ చేస్తున్న ఈ షో ద్వారా ఎంతో మంది సామాన్య నటులు ప్రముఖ కమెడియన్లుగా ఎదిగారు. చాలామంది కమెడియన్లు సినిమాల్లో కూడా అవకాశాలు చేజెక్కించుకున్నారు. అయితే, జబర్దస్త్-ఎక్స్ ట్రా జబర్దస్త్‌లో సుధీర్, గెటప్ శీను, ఆటో రాం ప్రసాద్ ఈ ముగ్గురు మిత్రులు కాంబోలో స్కిట్ అంటే ప్రేక్షకులకు బుల్లితెర ప్రేక్షకులకు విందు భోజనమే. ఈ ముగ్గురు కలిశారంటే పొట్ట చెక్కలు కావాల్సిందే. వీళ్ల టీంలో స్కిట్ ఆటో రాం ప్రసాద్ రాసినా.. సుధీర్, గెటప్ శీను సూచనలు సలహాలతో ప్రతి స్కిట్ పేలేట్టు చేస్తారు. ఇన్నాళ్లూ ఒకే మాట.. ఒకే బాటగా సాగిని ఈ ముగ్గురూ తలో దారి చూసుకున్నారు. 

ఎలాంటి పరిస్థితుల్లోనూ కామెడీ షోను వదిలే సమస్యే లేదని చెప్పిన సుధీర్.. ఇప్పుడు అనివార్య కారణాలతో తనకు లైఫ్ ఇచ్చిన షోకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. సుడిగాలి సుధీర్ కానీ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేస్తే ఆయనతో పాటే ఆటో రామ్ గెటప్ శ్రీను కూడా గత కొన్నిరోజులుగా జబర్దస్త్ షోలో కనిపించడం లేదు. ఆటో రామ్ ప్రసాద్, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను వీరు ముగ్గురు మంచి స్నేహితులు. వీరు ముగ్గురు కలిసి స్కిట్ చేస్తే ఇక ఆ స్కిట్ సూపర్ హిట్ అనే చెప్పాలి. 

జబర్దస్త్ షోలో వీరి ముగ్గురు కలిస్తే.. ఇక ఆ రోజు రేటింగ్ కూడా మామూలుగా ఉండదు. అలాంటి వీరి ముగ్గురు ఇప్పుడు విడిపోయారు. సుధీర్, గెటప్ శ్రీను, రాం ప్రసాద్ స్నేహంపై తాజాగా విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రొమో (Extra Jabardasth Promo) అందరిచేత కన్నీళ్లు తెప్పిస్తోంది. ముగ్గురు ఎలా ఉండేవాళ్లు.. ఎలా స్కిట్ చేసేవాళ్లు.. ఎలా విడిపోయారు అనే దానిపై స్కిట్ చేశారు. దీంతో ఈ వారం ఈ స్కిట్ చేసిన కమెడియన్లతో పాటు.. స్కిట్ చూసిన జబర్దస్త్ యాంకర్లు, స్కిట్ ఆర్టిస్టులు, కమెడియన్లు అంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రొమో చూసిన ఆడియన్స్ కూడా కంటతడి పెట్టుకుంటున్నారు. టీఆర్పీ కోసం ఈ స్కిట్ చేసినా.. రియల్ ఇన్సిడెంట్స్‌తో రాకింగ్ రాకేష్,కెవ్వు కార్తీక్, నూకరాజులు అదరగొట్టేశారు. చివర్లో ఆటో రాం ప్రసాద్.. ‘నేను రైటర్‌ని నాకేంటి స్కిట్ రాసేద్దాం అనుకుంటా కానీ.. వాళ్లిద్దరూ లేకపోవడం తెలియకుండానే ఒంటరి అనే ఫీలింగ్ వచ్చింది’ అని ఏడుస్తూ చెప్పడం.. ఈ ప్రోమో చూసే ప్రతి ప్రేక్షకుడి కళ్లు చెమ్మగిల్లేట్టు చేసింది.

మరోవైపు ప్రోమోలో 'జబర్దస్త్' రష్మి రోడ్డెక్కింది. న్యాయం కావాలంటూ ఆమె టెంట్‌ వేసుకుని మరీ ధర్నాకి దిగింది. అయితే ఇటీవల జబర్దస్త్ షోని సుడిగాలి సుధీర్‌ విడిచిపెట్టిన నేపథ్యంలో ఇప్పుడు రష్మి (Anchor Rashmi) ధర్నా చేయడం హాట్‌ టాపిక్‌ అవుతోంది. అయితే ఇమ్మాన్యుయెల్‌ మాత్రం ఫ్లైట్ లో చక్కర్లు కొట్టడం, రాంప్రసాద్‌ ఏం జరిగిందని ఆరా తీయడం మరింత ఆసక్తిని పెంచింది. రష్మి ధర్నా చేస్తున్నది చూసిన ఇమ్మాన్యుయెల్‌ స్పందిస్తూ, నేను అప్పుడే చెప్పాను.. వద్దురా మనకు ఇవన్నీ అంటూ లవ్‌ సింబల్‌ చూపించారు ఇమ్మాన్యుయెల్‌. అయితే ఏంట్రా అది అని రాంప్రసాద్‌ అడగ్గా, లవ్‌ సింబల్స్ అంటూ సెటైరికల్‌గా చెప్పడంతో రష్మి ముఖం వాడిపోయింది. ఏం చెప్పాలో అర్థం కాక ముఖం తిప్పేసుకుంది. అయితే ఇదంతా కామెడీగా చేసిన స్కిట్‌ కావడం విశేషం. కానీ సుడిగాలి సుధీర్‌ `జబర్దస్త్` షోని వీడటం వల్లే రష్మి ధర్నా చేస్తుందని అంటున్నారు. సుధీర్‌ తనని వదలి వెళ్లిపోవడంతో రష్మి తనకు న్యాయంచేయాలని పోరాడుతుందని సెటైర్లు పేలుస్తున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!