హైదరాబాద్‌లో అజిత్‌ (Ajith)ను కలిసిన ఆది పినిశెట్టి (Aadhi Pinisetty).. పెళ్లికి ఆహ్వానించేందుకేనా? కలిసి సినిమా చేస్తున్నారా?

Updated on May 15, 2022 06:29 PM IST
ఆది పినిశెట్టి (Aadhi Pinisetty), అజిత్ (Ajith)
ఆది పినిశెట్టి (Aadhi Pinisetty), అజిత్ (Ajith)

తమిళ సూపర్ స్టార్ అజిత్‌ను (Ajith) ఆది పినిశెట్టి హైదరాబాద్‌లో కలిశారు. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం నెట్‌లో వైరల్ అవుతోంది. ఇక, అజిత్, ఆది ఎందుకు కలిశారనే దానిపై కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సినిమా షూటింగ్‌కు సంబంధించి కొద్దిరోజులుగా అజిత్‌ హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఇక, ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కి గల్రానీ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో కూడా హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తన పెళ్లికి ఆహ్వానించేందుకే అజిత్‌ను ఆది పినిశెట్టి కలిశారని సినిమా ఇండస్ట్రీ టాక్. ఇక, మరో వార్త కూడా నెట్‌లో వైరల్‌ అవుతోంది. సినిమా షూటింగ్‌ కోసం హైదరాబాద్‌లో ఉన్న అజిత్‌ను ఆది  కలిసింది తన పెళ్లికి పిలవడానికి కాదని ఈ ఇద్దరూ కలిసి చేయబోయే ప్రాజెక్ట్‌ గురించి చర్చించడానికి అని పలువురు చెబుతున్నారు. ఇప్పటికే అజిత్ – ఆది పినిశెట్టి కలిసి సినిమా చేస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.

తమిళ స్టార్ హీరో అజిత్‌ హీరోగా చేస్తున్న అజిత్‌61 మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. హెచ్‌ వినోద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా, ప్రముఖ దర్శకుడు, రచయిత రవిరాజా పినిశెట్టి కొడుకుగా వెండితెరకు పరిచయమైన హీరో ఆది పినిశెట్టి (Aadhi Pinisetty).  భిన్నకథా చిత్రాలతో తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో తనకంటూ ఓ ఇమేజ్​ని క్రియేట్​ చేసుకున్నాడు ఆది. ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు స్టైలిష్ విలన్ గా దూసుకుపోతున్న ఆదికి మార్చిలో నిక్కీ గల్రానీతో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ఏంటంటే ఈ జంట ఈ నెల 18న పెళ్లి బంధంతో ఒకటవ్వనున్నారు. ఈ పెళ్లికి చెన్నైలోని ఓ స్టార్​ హోటల్​ వేదిక కానుందని తెలుస్తోంది. ఈ పెళ్లి ఆది కుటుంబ సంప్రదాయం ప్రకారం జరగనుందని, ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులు దగ్గరి బంధువులు మరియు అత్యంత సన్నితులు మాత్రమే హాజరు కానున్నారని తెలుస్తోంది. 

`యాగవరైనమ్ నా కక్కా(తెలుగులో మలుపు)`అనే తమిళ సినిమాతో తొలిసారి ఆది పినిశెట్టి(Aadhi Pinisetty), నిక్కీ గల్రానీ కలిసి నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఇప్పుడీ జంట నిశ్చితార్థం చేసుకుని పెళ్లి వరకు వచ్చారు. కాగా సినిమాల విషయానికి వస్తే.. ఆది పినిశెట్టి ఇటీవల `గుడ్ లక్ సఖీ` `క్లాప్` చిత్రాలతో ప్రేక్షకులను పలకరించాడు. వీటిలో గుడ్ లక్ సఖీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా క్లాప్ ప్రేక్షకులను బాగానే అలరించింది.

ప్రస్తుతం ఆది పినిశెట్టి `ది వారియర్` మూవీలో విలన్ గా అలరించబోతున్నాడు. ఎన్.లింగుస్వామి దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కృతి శెట్టి జంటగా నటిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీ జూలై 14న తెలుగు తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు ఆది పినిశెట్టి హీరోగానూ పలు సినిమాలు చేస్తున్నాడు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!