తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ (Telugu Indian Idol) షో : జ‌డ్జిల మ‌ధ్య మాట‌ల యుద్దం!

Updated on Apr 29, 2022 09:41 PM IST
తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ (Telugu Indian Idol Show)
తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ (Telugu Indian Idol Show)

టాలీవుడ్ నిర్మాత‌ అల్లు అరవింద్ ఆహా (Aha) తెలుగు ఓటిటి స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. కొద్ది రోజుల్లోనే ఈ సంస్థ జనాలకు బాగా రీచ్ అయ్యింది. అయితే ఈ ఓటీటీలో తెలుగు ఇండియన్ ఐడల్ (Telugu Indian Idol) షో పేరుతో ఓ మ్యూజిక్‌ కాంపిటీషన్‌ షోను సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. సింగింగ్ టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఆహా సంస్థ ‘తెలుగు ఇండియన్ ఐడల్’ షోను స్టార్ట్ చేసి విజయ వంతంగా ప్రసారం చేస్తోంది. 

అయితే, ఈ షోకు గతంలో ఇండియన్‌ ఐడల్‌గా నిలిచిన ప్రముఖ సింగర్‌, బిగ్ బాస్ ఫేమ్ శ్రీరామచంద్ర హోస్ట్ వ్య‌వ‌హ‌రిస్తుండగా.. మ్యూజిక్ డైరెక్ట‌ర్ థమన్, హీరోయిన్ నిత్యా మీనన్ (Nitya Menen), సింగ‌ర్ కార్తీక్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ షో తెలుగులో విప‌రీతంగా ప్రేక్షకాదరణ పొందుతూ దూసుకు పోతుంది. ఈ క్ర‌మంలో తాజాగా ఈ షోలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్ర‌స్తుతం ఈ షో మొదటి సీజన్ చివరికి వచ్చేసింది. అయితే, ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా డబుల్ ధమాకా స్పెషల్ రౌండ్ లో భాగంగా న్యాయనిర్ణేతలైన‌ నటి నిత్యా మీనన్ - సంగీత స్వరకర్త తమన్ మధ్య తీవ్ర‌ మాటల యుద్ధం జరిగింది. 

ఈ క్ర‌మంలో ఈ షోకి మరో న్యాయనిర్ణేతగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ గాయకుడు కార్తీక్ మొదట్లో నిత్యాకు మద్దతు ఇచ్చాడు. అయితే ఆ త‌రువాత‌ మనసు మార్చుకున్నాడు. దీంతో నిత్య మరింత బాధ పడింది. ఇంత‌కీ జ‌డ్జిల మ‌ధ్య గొడ‌వ ఎలా మొద‌లైందంటే.. నాచురల్ స్టార్ నాని న‌టించిన‌ MCA సినిమా నుంచి ఏవండోయ్ నాని గారు అనే పాట పాడిన సమయంలో వీరి మధ్య వాదన చోటు చేసుకుంది. 

సింగర్ శ్రావణ భార్గవి తో జోడి కట్టిన కంటెస్టెంట్ మారుతీ, ఏవండోయ్ నాని గారు అనే పాటను ఆలపించారు. ఈ పాటకు నిత్యా మీనన్ ఫిదా అయి మంచి కాంప్లిమెంట్లు ఇచ్చింది. మ‌రో జ‌డ్జి కార్తీక్ కూడా బెస్ట్ పెర్ఫెర్మెన్స్ అంటూ మారుతిని అభినందించారు. అయితే వీరిద్దరి నిర్ణయానికి వ్యతిరేకంగా మ్యూజిక్ డైరెక్ట‌ర్ థమన్ బిలో యావరేజ్ పెర్ఫార్మెన్స్ అంటూ జ‌డ్జిమెంట్ ఇచ్చారు. 

ఈ క్ర‌మంలోనే వారిద్ద‌రికీ వాద‌న జ‌రిగింది. నేను థమన్ అభిప్రాయంతో ఏకీభవంచడం లేదంటూ నిత్యా తెలిపింది. అతడి కాన్ఫిడెన్స్ చాలా బాగా నచ్చిందని పేర్కొంది. అయితే థ‌మ‌న్ మాత్రం అత‌డి వాయిస్ తో హ్యాపీ గా లేనని అన్నాడు. అయితే, అప్ప‌టి వ‌ర‌కు నిత్యాకు మ‌ద్ద‌తు ప‌లికిన సింగ‌ర్ కార్తీక్ థ‌మ‌న్-నిత్యాకు క్లాష్ రాగానే మ‌న‌సు మార్చుకున్నాడు. దీంతో నిత్యా చాలా హ‌ర్ట్ అయింది.  

అయితే, ఓ షో జ‌డ్జిల మ‌ధ్య వ‌చ్చిన‌ క్లాష్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఈ నేప‌థ్యంలో ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ షోలోని సింగర్స్ ఇటీవ‌ల జ‌రిగిన‌ ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి సహా అందరి ముందు ఆ సినిమాలోని సాంగ్స్ పాడి అలరించారు.

ఇక‌, నిత్యామీన‌న్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. అలా మొద‌లైంది సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ త‌ర్వాత ఎన్నో హిట్ చిత్రాల‌లో న‌టించింది. యంగ్ హీరో నితిన్ తో క‌లిసి ఇష్క్, గుండెజారి గ‌ల్లంత‌య్యిందే వంటి రెండు హిట్ చిత్రాల్లో న‌టించింది. ఇక‌, తాజాగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో క‌లిసి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా భీమ్లా నాయ‌క్ లో ఆయ‌న‌కు జంట‌గా న‌టించింది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!