Mrunal Thakur: బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న 'సీతారామం'.. దర్శకుడిని హత్తుకొని ఏడ్చేసిన మృణాళ్‌ ఠాకూర్!

Published on Aug 07, 2022 10:10 AM IST

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన దుల్క‌ర్ స‌ల్మాన్‌ (Dulquer Salman), మృణాళ్‌ ఠాకూర్ (Mrunal Thakur) హీరో హీరోయిన్లుగా న‌టించిన 'సీతారామం' (SitaRamam) సినిమా బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌గా నిలిచింది. 'అందాల రాక్ష‌సి' ఫేం హ‌నురాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా విడుద‌లైంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. హీరో సుమంత్ అక్కినేని కీలకపాత్రలలో నటించారు. 

కాగా.. ఈ మూవీ తెలుగు, తమిళం, మలయాళ భాషలలో విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. 'సీతారామం' సినిమా చూసిన హీరో హీరోయిన్లు ఎమోష‌న‌ల్ అయ్యారు. ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడిని (Hanu Raghavapudi) హ‌త్తుకుని మ‌రీ ఏడ్చేశారు. ప్ర‌స్తుతం ఆ విజువ‌ల్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

'సీతారామం' సినిమాలో దుల్క‌ర్ స‌ల్మాన్‌, మృణాళ్‌ ఠాకూర్ (Mrunal Thakur) న‌ట‌న‌కు సినీ ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లు అందుతున్నాయి. ఈ సినిమాను చూసిన దుల్క‌ర్, మృణాళ్ ఎమోష‌న‌ల్ అయ్యారు. సినిమాను గొప్ప‌గా చిత్రీక‌రించిన ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడిని హ‌త్తుకుని ఆనంద‌భాష్పాలు కార్చారు. వెండితెర‌పై తన సీన్లు ఎంతో గొప్ప‌గా తెర‌కెక్కించారంటూ మృణాళ్‌ ఠాకూర్ ద‌ర్శ‌కుడిని ప్ర‌శంసించారు. ప్రేక్ష‌కుల స్పంద‌న చూసిన మృణాళ్ హ‌ను రాఘ‌వ‌పూడిని ప‌ట్టుకుని ఏడ్చేశారు.

'సీతారామం' సినిమాను చూసిన ప్రేక్ష‌కులు అదిరిపోయే రివ్యూలు ఇస్తున్నారు. ఓ మంచి ప్రేమ‌క‌థా చిత్రాన్ని  ఎంతో అద్భుతంగా హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కించారని అంటున్నారు. ప్రతీ స‌న్నివేశాన్ని చాలా చ‌క్క‌గా పండించార‌న్నారు. దుల్క‌ర్ స‌ల్మాన్ కూడా ద‌ర్శ‌కుడిని చూసి ఎమోష‌న‌ల్ అయ్యారు. పుష్ప త‌ర్వాత  రష్మిక మందన్న (Rashmika Mandanna) పాన్ ఇండియా హీరోయిన్‌గా మారారు.  ఆమె ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించ‌డం విశేషం. 

Read More: 'సీతా రామం'లో సీత పాత్ర చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నా: ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మృణాల్ ఠాకూర్..!