Maa Neella Tank: 'జీ5' ఓటీటీలో సుశాంత్ (Sushant) హీరోగా ‘మా నీళ్ళ ట్యాంక్’ వెబ్ సిరీస్.. ప్రమోషన్స్ షురూ!

Published on Jul 14, 2022 06:19 PM IST

Maa Neella Tank: అక్కినేని హీరో సుశాంత్ హీరోగా.. 'వరుడు కావలెను' ఫేమ్ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘మా నీళ్ళ ట్యాంక్’. ఈ వెబ్ సిరీస్ ఈ నెల 15వ తేదీ నుంచి జీ5లో ప్రసారం కాబోతోంది. ఇక, ఇందులో సుశాంత్ (Hero Sushant) పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించగా.. ప్రియా ఆనంద్ హీరోయిన్ గా నటించింది. సుదర్శన్, ప్రేమ్ సాగర్, నీరోషా, దివి తదితరులు ఈ నీళ్ళ ట్యాంక్‌లో నటులుగా ఉన్నారు. 

‘మా నీళ్ళ ట్యాంక్’ వెబ్ సిరీస్ త్వరలో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు. ఇందులో భాగంగానే ఫస్ట్-లుక్, టీజర్, ట్రైలర్ అంటూ హడావుడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ను బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) విడుదల చేసింది. 

ఇక ఈ వెబ్ సిరీస్ లో ప్రియా ఆనంద్ (Priya Anand) అచ్చమైన తెలుగు అమ్మాయి పాత్రలో సందడి చేయనున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ కి ప్రియా ఆనంద్ స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం గమనార్హం. ఈమె శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానా నటించిన మొదటి చిత్రం 'లీడర్' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 

టాలీవుడ్ హీరో సిద్ధార్థ్ (Hero Siddarth) నటించిన '180' సినిమా ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ తమిళంలో వరుస సినిమా అవకాశాలను అందుకోవడంతో తెలుగు తెరకు దూరమయ్యారు. ఈ విధంగా తెలుగు తెరకు దూరమైన ఈ బ్యూటీ రీ ఎంట్రీ కోసం తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే దాదాపు పది సంవత్సరాల తర్వాత ప్రియా ఆనంద్ 'మా నీళ్ల ట్యాంక్' వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 

Read More: Maa Neella Tank Teaser: అక్కినేని సుశాంత్ హీరోగా 'మా నీళ్ల ట్యాంక్' వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న టీజర్!