Nivetha Pethuraj: మొబైల్ షోరూం ఓపెనింగ్ లో సందడి చేసిన టాలీవుడ్ బ్యూటీ నివేదా పేతురాజ్!

Published on Jun 12, 2022 01:47 PM IST

టాలీవుడ్ లో 'మెంటల్ మదిలో' సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైంది అందాల భామ నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj). ఆ సినిమా బాగానే అలరించినా ఈ అమ్మడుకు మాత్రం ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళ ఇండస్ట్రీలో బాగా బిజీ అయ్యింది. అయితే ఆ మధ్య వచ్చిన సాయి ధరమ్ తేజ్ 'చిత్ర లహరి'లో మరో తెలుగు సినిమా 'బ్రోచేవారేవరురా..' లో కూడా అదరగొట్టింది నివేదా పేతురాజ్. 

ఇక అల్లు అర్జున్ (Allu Arjun), త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ 'అల వైకుంఠపురములో' సినిమాలో నటించి మరింత పాపులర్ అయ్యింది. ఇక తాజాగా ఆహా ఓటీటీ కోసం బ్లడీ మేరీ అనే సినిమా చేసారు నివేదా. ఇందులో ఆమె తన నటనతో ఇరగదీశారు. ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కిరీటి దామరాజు, రాజ్‌కుమా కోపిశెట్టి ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. అనుకోని హత్యకేసులో ఇరుక్కున్న ముగ్గురు స్నేహితులు ఎలా తప్పించుకున్నారు అనేది చిత్ర కథ. వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో బ్రహ్మాజీ మరో కీలక పాత్ర పోషించారు. సినిమాకు మంచి ఆదరణ పొందుతోంది. 

ఈ బ్యూటీ తాజాగా పేట్ బషీరాబాద్ లో శనివారం సందడి చేశారు. హ్యాపీ మొబైల్ (Happi Mobiles) అండ్ ఎలక్ట్రానిక్స్ షోరూంను నివేదా పేతురాజ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రాల్లో హ్యాపీ షోరూం 75వ స్టోర్ ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఇక, ఈ కార్యక్రమంలో సంస్థ ఛైర్మన్, ఎండీ కృష్ణ పవన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోట సంతోష్ తదితరులు పాల్గొన్నారు. 

Read More: Nivetha Pethuraj: సినిమా ఆఫర్ల కోసం అందాలు ఆరబోస్తున్న నివేదా పేతురాజ్