SS Rajamouli: 'కార్తికేయ 2' ప్రీమియర్స్ లో రాజమౌళి ఆశీర్వాదం తీసుకున్న అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran)

Published on Aug 17, 2022 02:19 PM IST

మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో వచ్చిన 'అఆ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ఆ సినిమా తర్వాత ఈ బ్యూటీకి అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ అమ్మడు తెలుగులో వరుసగా క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయిపోయింది.
   
అనుపమ పరమేశ్వరన్ తాజాగా హీరో నిఖిల్ (Nikhil) సరసన ‘కార్తికేయ 2’ చిత్రంలో నటించింది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’, ‘అభిషేక్ పిక్చర్స్’ సంస్థలపై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆదిత్య మీనన్, శ్రీనివాస్ రెడ్డి, వైవా హర్ష వంటి వారు కూడా ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. 

‘కార్తికేయ 2’ (Karthikeya 2) సినిమా ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. 'కార్తికేయ' సినిమాకి కొనసాగింపుగా 'కార్తికేయ2' తెరకెక్కింది. కాగా, ఈ సినిమా ప్రీమియర్ షోకి దర్శక ధీరుడు రాజమౌళి ఫ్యామిలీ కూడా హాజరయింది. సినిమా చూసిన తర్వాత చిత్రయూనిట్ కి తన అభినందనలు తెలిపారు రాజమౌళి. ఈ క్రమంలో అనుపమ.. రాజమౌళి కాళ్ల మీద పడి ఆయన ఆశీర్వాదం తీసుకుంది. ఓ హీరోయిన్ అయ్యుండి ఆమె అలా చేయడం అక్కడ ఉన్న వారందరిని ఆశ్చర్యపరచింది.

ఈ సందర్భంగా.. ‘సినిమా బాగుందని, నీ పాత్ర కూడా చాలా బాగుందని రాజమౌళి అనుపమతో చెప్పినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే ఆమె రాజమౌళి (SS Rajamouli) కాళ్ళ పై పడినట్లు తెలుస్తోంది. జక్కన్న పక్కనే కీరవాణిని అలాగే వారి కుటుంబ సభ్యులను కూడా కౌగిలించుకుంది అనుపమ. కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read More: Karthikeya 2 Trailer: 'ఐదు సహస్రాల ముందే పలికిన ప్రమాదం.. ప్రమాదం లిఖితం..' ఆసక్తికరంగా 'కార్తికేయ 2' ట్రైలర్