Rakul Preet Singh: టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు నోటీసులు జారీ చేసిన ఈడీ  

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్‌ను ఇప్పటికే ఒకసారి విచారించిన ఈడీ అధికారులు.. ఆమెను మరోమారు విచారణకు హాజరవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు

డ్రగ్స్ కేసు మరోమారు తెరపైకి వచ్చింది. ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా చాలా మంది సెలబ్రిటీలకు ఇందులో ప్రమేయం ఉందని సమాచారం. టాలీవుడ్, బాలీవుడ్, శాండల్‌వుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులకు డ్రగ్స్ కేసులతో సంబంధం ఉన్నట్లు వినికిడి. గతేడాది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో డ్రగ్స్ (Drugs Case) కోణం బయటకు వచ్చింది. ఈ కేసులో రియా చక్రవర్తి, ఆమె సోదరుడ్ని విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు.. శాండల్‌వుడ్‌లో సంజనా గల్రానీని కూడా అరెస్ట్ చేశారు. 

టాలీవుడ్‌లోనూ రానా, రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) లాంటి వారిని ఈడీ విచారించింది. ఇప్పుడు మరోసారి డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చింది. ఈ కేసులో తాజాగా రకుల్‌కు ఈడీ (Enforcement Directorate) నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో గతేడాది సెప్టెంబర్ 3న రకుల్‌ను అధికారులు విచారించారు. అయితే విచారణ మధ్యలోనే ఆమె వెళ్లిపోయారు. దీంతో ఆమెను పూర్తిస్థాయిలో విచారించలేకపోయారు. ఈ నేపథ్యంలో ఇంకోసారి ఇన్వెస్టిగేషన్‌కు హాజరవ్వాల్సిందిగా రకుల్‌కు అధికారులు నోటీసులు ఇచ్చారు. 

ఇకపోతే, తెలుగులో రకుల్ ప్రీత్ సింగ్‌కు ఆఫర్లు తగ్గిపోయాయి. ఇక్కడ చివరగా వైష్ణవ్ తేజ్ సరసన నటించిన ‘కొండపొలం’ సినిమాతో ఆమె ప్రేక్షకులను పలకరించారు. టాలీవుడ్‌లో ఆఫర్లు తగ్గిపోవడంతో బాలీవుడ్‌పై రకుల్ దృష్టి పెడుతున్నారు. ఇటీవల ‘థ్యాంక్ గాడ్’తో హిందీలో తన అదృష్టాన్ని ఆమె పరీక్షించుకున్నారు. సీనియర్ హీరో అజయ్ దేవగణ్, యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో వచ్చిన ‘థ్యాంక్ గాడ్’ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆమె ప్రధాన పాత్రలో యాక్ట్ చేస్తున్న ‘ఛత్రీవాలి’ (Chhatriwali) సినిమా త్వరలో ఓటీటీలో విడుదల కానుంది. తేజస్ ప్రభ విజయ్ దేవాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ త్వరలో జీ5 ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి రానుంది.

Read more: Unstoppable With NBK Season2: 'అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్బీకే' తర్వాతి ఎపిసోడ్ లో పవర్ స్టార్.. ఈ వార్తలో నిజమెంత?

You May Also Like These