Tollywood Shootings: రంగంలోకి దిగిన దిల్ రాజు (Dil Raju).. పారితోషికం తగ్గించుకునేందుకు అగ్రహీరోలు రెడీ!

పారితోషకం విషయమై దిల్ రాజు.. అల్లు అర్జున్ (Allu Arjun) , రామ్ చరణ్, ఎన్టీఆర్ (NTR) స్టార్ హీరోలతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం.

Tollywood Shootings: టాలీవుడ్ షూటింగ్ లు బంద్ అంశంపై అగ్రహీరోలు చర్చలు జరుపుతున్నారు. వారితో నిర్మాతల చర్చలు ఫలిస్తున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్‌ సంక్షోభంలో భాగంగా పలువురు అగ్ర హీరోలు తమ రెమ్యునరేషన్‌ తగ్గించుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు షూటింగ్ ల సంక్షోభంపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) లేఖ రాశారు. దీంతో ఈరోజు మధ్యాహ్నం మరోసారి కౌన్సిల్ సమావేశం కానుంది. షూటింగ్ ల బంద్ పై.. ఈ సమావేశంలో షూటింగ్ ల బంద్ పై నిర్ణయం తీసుకోనున్నారు. 

కాగా, ఆగస్టు 1వ తేదీ నుంచి సినిమా షూటింగ్ లు (Movie Shootings) బంద్ చేయాలని నిర్మాతల మండలి నిర్ణయించిన సంగతి తెలిసిందే. నిర్మాతలు ఇలా బంద్ ప్రకటించడంతో స్టార్ హీరోలు కూడా దిగివస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సినిమా నిర్మాణ వ్యయం రోజు రోజుకు పెరిగిపోతుండడంతో వెంటనే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు నిర్మాతలు. షూటింగ్‌ దశలో ఉన్న పెద్ద హీరోల సినిమాలతో పాటు చిన్న సినిమాల షూటింగ్‌ నిలిచిపోయే పరిస్థితి నెలకొనడంతో ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు రంగంలోకి దిగాడు.


పారితోషికం విషయమై దిల్ రాజు (Dil Raju) స్టార్ హీరోలతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా పెరుగుతున్న నిర్మాణ వ్యయం అలాగే ఇతర ఖర్చులను దృష్టిలో పెట్టుకొని పారితోషకం తగ్గించుకునేందుకు అల్లు అర్జున్ (Allu Arjun) , రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (NTR) లాంటి అగ్ర హీరోలు కూడా ముందుకు వచ్చినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.    

ఇదిలా ఉంటే.. కరోనా మహమ్మారి కారణంగా ఎక్కువగా నష్టపోయిన పరిశ్రమలలో చిత్ర పరిశ్రమ కూడా ఉందని చెప్పవచ్చు. సినిమా ఇండస్ట్రీపై ఆధారపడి బతికిన ఎంతోమంది రోజువారీ కార్మికులు, జూనియర్ ఆర్టిస్టులు (Tollywood Junior Artists) అందరూ సినిమా షూటింగులు లేక డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు సినీ పెద్దలు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి టికెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతులు కూడా తీసుకొచ్చారు. 

Read More: త్రివిక్రమ్ దర్శకత్వంలో యాడ్ షూట్ కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టైలిష్ లుక్.. ఫొటోలు వైరల్!

Credits: Instagram
You May Also Like These