ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలలో అతిథిగా రామ్ చరణ్ (Ram Charan)

Published on Apr 23, 2022 10:36 PM IST

భారత స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకొనే క్రమంలో చేపట్టిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హాజరయ్యారు.

రక్షణ శాఖ అధికారులు నిర్వహించిన యుద్ధవీరుల స్మారక కార్యక్రమంలో పాల్గొని అమరులకు నివాళులు అర్పించారు.ఆజాదీ కా ఆజాదీ అమృత్ మహోత్సవ్  కార్యక్రమంలో రామ్ చరణ్ (Ram Charan) మాట్లాడుతూ, దేశ ఔన్నత్యాన్ని చాటే విధంగా ఈ ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించడం ఆనందాయకమన్నారు.

భారతావని 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను జరుపుకోవడం, అమరవీరులను స్మరించుకోవడం అందరి అదృష్టమని, ప్రజల జీవనం ప్రశాంతంగా గడుస్తుందంటే, అది దేశ సైనికుల త్యాగఫలితమే అని ఆయన అన్నారు.