నేష‌న‌ల్ క్ర‌ష్ (Rashmika Mandanna) ర‌ష్మిక మందన్నా అల్ల‌రి చేష్టలు.. వీడియో వైర‌ల్!

Published on May 13, 2022 09:51 PM IST

నేష‌న‌ల్ క్ర‌ష్ (Rashmika Mandanna) రష్మిక మందన్న.. విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న న‌టించిన‌ 'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ కావ‌డంతో.. తెలుగులో మరోసారి ఈ రౌడీ హీరోతో క‌లిసి 'డియర్ కామ్రెడ్స  సినిమాలో అదరగొట్టింది. ఇక‌, ఆ త‌ర్వాత‌ రష్మిక.. సూప‌ర్ స్టార్ మహేష్ బాబు తో క‌లిసి అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇక‌, ఈ బ్యూటీ అటు తెలుగుతో పాటు ప్యాన్ ఇండియా లెవల్లో సైతం సత్తా చాటుతోంది. అంతేకాకుండా 2020లో నేషనల్ క్రష్‌గా ఎంపికైంది. 

ఇదిలా ఉంటే.. తాజాగా దర్శ‌కుడు హను రాఘవపూడి దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతోన్న పీరియాడికల్ లవ్ స్టోరీ తెరకెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక .. అఫ్రీన్ అనే ముస్లిమ్ యువతి పాత్రలో నటిస్తోంది. క‌న్నడలో సైతం ఆమె పునీత్ రాజ్‌కుమార్ సరసన అంజనీ పుత్ర, గణేశ్ సరసన ఛమక్ అనే సినిమాల్లో నటించింది. ఇక, టాలీవుడ్ (Tollywood) లో యంగ్ హీరో నాగ శౌర్యతో కలిసి నటించిన ఛలో ఆమె తొలి తెలుగు సినిమా. ఆ తర్వాత వరుసగా తెలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఈ క్ర‌మంలో విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, నితిన్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్‌తో అవ‌కాశాలు ద‌క్కించుకుంటూ అదరగొడుతోంది ఈ బ్యూటీ.

రష్మిక మందన్న (Rashmika Mandanna) కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లాలోని విరాజ్‌పేట్‌లో ఏప్రిల్ 5, 1996లో జన్మించారు. అక్క‌డే కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత ఈ బ్యూటీ M. S. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుండి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. అనంత‌రం రష్మిక మందన్న బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఫర్ 2014 జాబితాలో చోటు సంపాదించారు.