Dil Raju: కల్యాణ్ రామ్ (KalyanRam) హీరోగా నటించిన 'బింబిసార' (Bimbisara) ఓటీటీ రిలీజ్ పై దిల్ రాజు కామెంట్లు!

ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌పై (Bimbisara OTT Release) నెట్టింట తెగ చర్చ జరుగుతోంది.

నందమూరి కల్యాణ్‌ రామ్‌ (Nandamuri Kalyan Ram) హీరోగా చారిత్రక కథాంశంతో వచ్చిన ‘బింబిసార’ (Bimbisara) మూవీ గ్రాండ్ సక్సెస్‌తో దూసుకుపోతోంది. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే సక్సెస్‌ను సొంతం చేసుకుంది. కాగా, ఈ చిత్రానికి తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. మూడో రోజుల వ్యవధిలోనే బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రెండు కోట్ల పైనే లాభాలు తీసుకొచ్చిన ఈ సినిమా మరిన్ని కలెక్షన్లు సాధించే దిశగా దూసుకువెళుతోంది.

‘బింబిసార’ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన కేథరిన్ థ్రెసా (Catherine Tresa), సంయుక్త మీనన్ (Samyuktha Menon) హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ భామ వరీనా హుస్సేన్ ఒక ఐటెం సాంగ్ లో కనిపించింది. ఇక, ఈ సినిమాను కొత్త దర్శకుడు వశిష్ట తెరకెక్కించగా భారీ బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ కొసరాజు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మించారు. 

ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌పై (Bimbisara OTT Release) నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు (Dil Raju) క్లారిటీ ఇచ్చారు. 50 రోజుల తర్వాతే బింబిసార ఓటీటీలో విడుదల అవుతుందని స్పష్టం చేశారు. దీంతో సెప్టెంబర్‌ 23న ఈ చిత్రం డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తోంది.

ఇక బింబిసార సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్‌ఏలోనూ భారీ వసూళ్లు (Bimbisara Boxoffice Collections) వస్తున్నాయి. కల్యాణ్‌ రామ్‌ ఈ సినిమాలో బింబిసార అనే క్రూరమైన రాజుగా శక్తివంతమైన పాత్రలో కనిపించారు. ఇక ఈ సినిమా విజయవంతంగా నడుస్తున్న నేపథ్యంలో రెండో భాగం కూడా (Bimbisara Part2) ఉంటుందని నిర్మాతలు ప్రకటించారు. 

Read More: 'బింబిసార' సినిమాలో నందమూరి కల్యాణ్ రామ్ నటనపై అల్లు అర్జున్ (Allu Arjun) కామెంట్లు.. ట్వీట్ వైరల్

Credits: Instagram
You May Also Like These