Advertisement

మేడే (May day) వేడుక‌ల్లో మెగాస్టార్ చిరంజీవి

ప్రపంచ కార్మికుల దినోత్స‌వం (May day) సంద‌ర్భంగా  హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన మే డే (May day) వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌ గౌడ్‌, కేంద్రమంత్రి కిష‌న్ రెడ్డి తదితరులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన తెలంగాణ సినిమాటోగ్ర‌ఫి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ (Minister Talasani Srinivas Yadav)  తెలుగు చిత్రపరిశ్రమ (Telugu film industry)కు ఆయ‌న‌ పెద్ద దిక్కుగా ఉన్నారని అన్నారు.

అనంత‌రం చిరంజీవి మాట్లాడుతూ.. ప్రపంచంలో ఏ రంగంలోనైనా కార్మికులకు ఒక నిర్ణీతమైన పనిగంటలు ఉంటాయి.  వాళ్లు తమ పనిని 8 గంటలపాటు చేస్తారు. ఆయా పనులను బట్టి ఆ 8 గంటల్లోనే ఎంతో కష్టపడేవారు ఉంటారు. కానీ అలాంటి ఒక నిర్ణీతమైన సమయమనేది లేకుండా పని చేసేది ఒక్క సినిమా కార్మికులు మాత్రమే అంటూ 'మేడే' సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. హైదరాబాద్  -  యూసఫ్ గూడాలో నిన్న జరిగిన సినీ కార్మికోత్సవంలో ప్రసంగిస్తూ చిరంజీవి ఈ మాట అన్నారు.

ఆచార్య త‌ర్వాత‌ నేను న‌టిస్తున్న‌ 'గాడ్ ఫాదర్' సినిమా షూటింగు ఈ మధ్య కోసం హైదరాబాద్-ముంబై అదే పనిగా తిరగవలసి వచ్చింది. నిజానికి నేను చాలా అలసిపోయాను. కానీ ఆ విషయం చెబితే  షూటింగు ఆగిపోతుంది. సినిమాను నమ్ముకున్న కార్మికులకు  ఇలాంటి కష్టాలు ఎన్నో ఉంటాయి. అందువల్లనే వారి నిత్వసర వస్తువుల పంపిణీ .. వ్యాక్సినేషన్  ఇప్పించే విషయంలో నేను బాధ్యత తీసుకున్నాను అని వివ‌రించారు.

Advertisement
You May Also Like These
Advertisement