సైమా అవార్డ్స్ కు బయల్దేరి వెళ్తున్న అల్లు అర్జున్ (Tollywood Icon star Allu Arjun at Siima Awards)
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన 'పుష్ప ది రైజ్' (Pushpa The Rise) సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో ఆ సినిమాకు సీక్వెల్గా 'పుష్ప2' సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాతో అల్లు అర్జున్కు దేశవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ’పుష్ప’ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన.. సౌత్తో పాటు నార్త్ ఆడియెన్స్ను కూడా ఆకట్టుకుంది.
Photo Credit :
pinkvilla
సైమా అవార్డ్స్ కు బయల్దేరి వెళ్తున్న అల్లు అర్జున్ (Tollywood Icon star Allu Arjun at Siima Awards)
తాజాగా బెంగుళూరులో జరగనున్న సైమా అవార్డ్స్ (Siima Awards) కి వెళ్లారు అల్లు అర్జున్. ఈ సందర్భంగా ఎయిర్ పోర్ట్ లో ఆయన కనిపించారు. బ్లాక్ డ్రెస్ లో స్టైలిష్ లుక్ లో బన్నీను చూసిన అభిమానులు, మీడియా కెమెరాకి పని చెప్పారు. తన హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ తో ఆకట్టుకుంటున్నారు బన్నీ. ప్రస్తుతం ఈ లుక్ కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
Photo Credit :
pinkvilla
సైమా అవార్డ్స్ కు బయల్దేరి వెళ్తున్న అల్లు అర్జున్ (Tollywood Icon star Allu Arjun at Siima Awards)
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం పుష్ప సినిమాకు సీక్వెల్ను తెరకెక్కిస్తున్నారు సుకుమార్ (Ditector Sukumar). ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు బన్నీ అభిమానులు. 'పుష్ప2' సినిమాపై ఒక వార్త ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ 22వ తేదీ నుంచి జరగనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తయిన సంగతి తెలిసిందే.
Photo Credit :
pinkvilla
సైమా అవార్డ్స్ కు బయల్దేరి వెళ్తున్న అల్లు అర్జున్ (Tollywood Icon star Allu Arjun at Siima Awards)
అలాగే 'పుష్ప2' (Pushpa 2) సినిమా పూర్తయిన తర్వాత అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్. 'అల వైకుంఠపురములో..' సినిమా తర్వాత త్రివిక్రమ్ ఇప్పటివరకు మరో సినిమా చేయలేదు. తాజాగా మహేష్బాబుతో సినిమాను మొదలుపెట్టారు. 'ఎస్ఎస్ఎంబీ28' (SSMB 28) సినిమా పూర్తయిన తర్వాత బన్నీ-త్రివిక్రమ్ కాంబోలో సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం.
Photo Credit :
pinkvilla
Follow Us