Advertisement

Pragya Jaiswal : హైదరాబాద్‌లో సినీ నటి ప్రగ్యా జైస్వాల్ సందడి

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ర్యాడిసన్‌ హోటల్‌లో నటి ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) సందడి చేశారు. బ్లెండర్స్‌ ప్రైడ్‌ ఫ్యాషన్‌ నైట్స్‌ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆమె, తన అభిమానులతో కాసేపు ముచ్చటించారు.  "హైదరాబాద్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఈ నగరం నాకు రెండవ ఇల్లు లాంటిది. నటిగా నా ప్రయాణం అనేది ఇక్కడ నుండే మొదలైంది" అని ఆమె తెలిపారు. 

ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకున్న కథానాయిక. ఈ సినిమా తర్వాత ఆమె గుంటూరోడు, ఆచారి అమెరికా యాత్ర, నక్షత్రం, ఓం నమో వెంకటేశాయ, మిర్చి లాంటి కుర్రాడు, సన్ ఆఫ్ ఇండియా లాంటి సినిమాలలో నటించింది. తాజాగా  బాలకృష్ణ నటించిన అఖండ చిత్రంలో కూడా హీరోయిన్ పాత్ర పోషించింది. గతంలో టిట్టూ ఎంబీఏ అనే ఓ హిందీ సినిమాలో కూడా ప్రగ్యా నటించింది. 

కంచె సినిమాలో నటనకు గాను ప్రగ్యా ఉత్తమ తొలి చిత్ర కథానాయికగా ఫిల్మ్ ఫేర్ అవార్డును కైవసం చేసుకుంది. ఆ చిత్రంలో నటనకు గాను సైమా, సినిమా, జీ అప్సర అవార్డులను కూడా ఆమె దక్కించుకుంది. అయితే, ఈ మధ్య కాలంలో ప్రగ్యా నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద అనుకున్న ఫలితాన్ని ఇవ్వడం లేదు. 

  

Credits: PINKVILLA
Advertisement
You May Also Like These
Advertisement