టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu).. తన రాబోయే చిత్రం 'సర్కారు వారి పాట' ప్రమోషన్లో బిజీగా మారాడు. త్వరలో ఈ సినిమా విడుదల కాబోతుండడంతో ఎక్కడిక్కడే ఇంటర్వ్యూలతో, ప్రెస్ మీట్లతో ఫుల్ బిజీగా ఉన్నాడు. కాగా, ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటించిన ఈ సినిమా గురువారం (మే 12) విడుదల కానుంది. డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కగా.. జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించాయి. థియేటర్లలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) సినిమా వచ్చి దాదాపు రెండున్నరేళ్లు దాటిన నేపథ్యంలో ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలున్నాయి. దీంతో, చిత్ర యూనిట్ ప్రమోషన్లలో స్పీడ్ పెంచింది. నాన్ స్టాప్గా ప్రమోషన్లు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇక, ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మహేష్ బాబు బుధవారం ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో ముచ్చటించారు. ఫాన్స్ అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబులు ఇస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే పలు మహేష్ బాబు (Mahesh Babu) ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అని ఓ అభిమాని అడగ్గా.. తన భార్య నమ్రత శిరోద్కర్ పేరు చెప్పారు. మీ భార్యలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి అని ఇంకొక యూజర్ అడిగిన ప్రశ్నకు.. ఆమెలో అన్నీ ఇష్టమే, అందుకే పెళ్లి చేసుకున్నా అని మహేష్ నవ్వుతూ బదులిచ్చారు. ఇదిలా ఉంటే.. ఆయన తన సతీమణితో కలిసి ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. అందులో భాగంగానే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొనేందుకు వచ్చి మీడియా కంటపడ్డారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ అవుతోంది.
Advertisement
సర్కారు వారి పాట (Sarkaruvaari Paata) ప్రమోషన్లలో బిజీగా సూపర్ స్టార్!
Advertisement
Advertisement
Follow Us