Advertisement

సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) : జోనితా పాడిన "మహేషా" సాంగ్ సూపర్ సక్సెస్

జోనితా గాంధీ (Jonita Gandhi) పేరు ఎప్పుడైనా విన్నారా? ఈమె ఓ కెనడియన్ గాయని.  పంజాబీ, తెలుగు, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, కన్నడ, మలయాళ భాషలలో కూడా ఈమె అనేక పాటలు పాడారు. అంతే కాదు.. హిందీ, తమిళ భాషలలో కూడా పలు పాటలను రికార్డు చేశారు. 

ది బ్రేకప్ సాంగ్, మెంటల్ మనదిల్, చెల్లామా, అరబిక్ కుతు వంటి పాటలు ఈమె పాపులారిటీని మరింత పెంచాయి. జోనితా యూట్యూబ్ ద్వారా కూడా అనేకమంది అభిమానులను సంపాదించుకుంది. ఈమె మ్యూజిక్ కెరీర్ చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాలోని టైటిల్ ట్రాక్ ద్వారా ప్రారంభమైంది. 

ఇటీవలే జోనితా హైదరాబాద్ వచ్చారు. సర్కారు వారి పాట సినిమాకు గాను ఈమె "మ మ మహేషా" అనే సాంగ్‌ను పాడారు. మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమాకి ఇప్పటికే మంచి ప్రీ రిలీజ్ టాక్ వచ్చేసింది. ఈ సినిమా గురించి జోనితా గాంధీ మాట్లాడుతూ, మహేష్ బాబు సినిమాకి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.  జోనితా గతంలో కూడా అనేక తెలుగు పాటలు పాడారు. కిక్ 2, కేరింత, హలో, లవ్ స్టోరీ మొదలైన సినిమాలలో పాటలు పాడారు. 

Credits: PINKVILLA
Advertisement
You May Also Like These
Advertisement