'పుష్ప 2' పాట‌ల విష‌యంలో త‌గ్గేదేలే - చంద్ర‌బోస్!..  పుష్ప‌రాజ్(Allu Arjun) కోసం విదేశాల్లో విహారం!!

Updated on Aug 10, 2022 10:42 AM IST
అల్లు అర్జున్ (Allu Arjun) న‌టించ‌బోయే పుష్ప 2 సినిమా పాట‌ల కోసం చంద్ర‌బోస్, దేవిశ్రీ ప్ర‌సాద్, సుకుమార్ యూర‌ప్‌కు వెళ్లార‌ట‌.
అల్లు అర్జున్ (Allu Arjun) న‌టించ‌బోయే పుష్ప 2 సినిమా పాట‌ల కోసం చంద్ర‌బోస్, దేవిశ్రీ ప్ర‌సాద్, సుకుమార్ యూర‌ప్‌కు వెళ్లార‌ట‌.

Pushpa 2: టాలీవుడ్‌లో అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న 'పుష్ఫ 2' సినిమాకు ఓ రేంజ్‌లో అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ ప‌లు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టిస్తున్నారు. సుకుమార్ మాత్రం 'పుష్ప 2' సినిమా పాట‌ల కోసం విదేశాల్లో విహ‌రిస్తున్నారు. ర‌చ‌యిత చంద్ర‌బోస్‌, దేవీశ్రీ ప్ర‌సాద్‌ల‌తో క‌లిసి పుష్ప‌రాజు కోసం పాట‌లు సిద్ధం చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

ఓ రేంజ్‌లో 'పుష్ప 2' పాట‌లు

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) న‌టించిన‌ 'పుష్ఫ - ది రైజ్' సినిమాకు పాట‌లు ప్ల‌స్ పాయింట్‌గా నిలిచాయి. ఈ సినిమాలో దాదాపు అన్ని పాట‌లు హిట్ అయ్యాయి. ముఖ్యంగా శ్రీవ‌ల్లి పాట ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. పాన్ ఇండియా సినిమాగా 'పుష్ఫ - ది రైజ్' స‌క్సెస్‌లో మ్యూజిక్ కూడా ప్ర‌ధాన పాత్ర పోషించింది. అన్ని భాష‌ల్లో ఈ సినిమా పాట‌లు పేలాయి. చిన్నా.. పెద్దా.. అనే తేడాలేకుండా 'పుష్ప' పాట‌ల‌ను తెగ ఎంజాయ్ చేశారు. 

'పుష్ప 2' కోసం అద్భుత‌మైన పాట‌లు సిద్ధం చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది. లిరిక్ రైట‌ర్ చంద్ర‌బోస్, మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీ ప్ర‌సాద్, ద‌ర్శ‌కుడు సుకుమార్ 'పుష్ప 2' పాట‌ల‌ను సిద్ధం చేస్తున్నారు.  'పుష్ప 2' పాట‌ల కోసం విదేశాల్లో విహ‌రిస్తున్నారు. యూర‌ప్‌లో దిగిన‌ ఫోటోల‌ను చంద్రబోస్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.  

అల్లు అర్జున్ (Allu Arjun) న‌టించ‌బోయే పుష్ప 2 సినిమా పాట‌ల కోసం చంద్ర‌బోస్, దేవిశ్రీ ప్ర‌సాద్, సుకుమార్ యూర‌ప్‌కు వెళ్లార‌ట‌.

త్వ‌ర‌లో సెట్స్‌పైకి 'పుష్ప 2'

ద‌ర్శ‌కుడు సుకుమార్ 'పుష్ప' సినిమాకు సీక్వెల్‌గా 'పుష్ప - ది రూల్' తెర‌కెక్కిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), ర‌ష్మిక మంద‌న్న 'పుష్ప - ది రూల్' చిత్రంలో హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ ద‌ర్శ‌కులు త్రివిక్ర‌మ్, హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌లు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టిస్తున్నారు.

'పుష్ప - ది రూల్' సినిమా కూడా పాన్ ఇండియా లెవ‌ల్‌లో రూ. 350 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్, ముత్తంశెట్టి మీడియా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నారు.   

Read More: పుష్ప‌ 2 (Pushpa 2) : బడా స్టార్లతో పోటీగా.. సంక్రాంతి బ‌రిలోకి అల్లు అర్జున్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!